ఒకప్పుడు పరుచూరి బ్రదర్స్ కు వచ్చిన స్థాయిలో ఇప్పుడు వక్కంతం క్రేజ్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. కేవలం ఒక్క కథ మాత్రమే ఇచ్చి స్క్రీన్ ప్లే సంభాషణలు రాయక పోయినా వక్కంతం చెప్పే స్టోరీ లైన్ కు క్రేజ్ ఏర్పడటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్. దర్శకుడు సురేంద్రరెడ్డికి ఆ స్థాన రచయితగా పేరు తెచ్చుకున్న వక్కంతంకు ఎప్పటికైనా దర్శకుడిగా మారాలని కోరిక.
కానీ అతడి కోరిక తీరే అవకాశం ఇప్పట్లో లేదు అని అంటున్నారు. దీనికి కారణం వక్కంతం వంశీని డైరెక్టర్ అవ్వనివ్వకుండా స్టార్ డైరెక్టర్లంతా ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు అని టాక్. ‘అదుర్స్ 2’కి కథ ఇమ్మని వినాయక్ అతడి వెంట పడుతున్నాడు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
దీనికితోడు ఇప్పుడు ‘టెంపర్ 2-‘ కి కథ రెడీ చేయమని బండ్ల గణేష్ అతడికి భారీ ఆఫర్లిస్తున్నాడు. ఈ ఆఫర్లకు తోడు అనేకమంది టాప్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు వక్కంతం వెంట పడుతూ ఉండటంతో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సెలెబ్రెటీగా ఈ రచయిత మారిపోయాడు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78826/TOP-HEROES-HAUNTING-TOWARDS-VAKKANTHAM/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.