ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో రానా త్రిష పెళ్ళి వ్యవహారం పై మొట్టమొదటిసారిగా స్పందించాడు. త్రిషకు తనకు గల సాన్నిహిత్యం గురించి వివరణ ఇచ్చాడు. త్రిష ఇప్పటికి కూడా తనకు మంచి స్నేహితురాలని ఈమధ్యనే ఆమెను ఆమెకు కాబోయే భర్త వరుణ్ ను గోవాలో కలిసి వారిద్దరినీ అభినందించడమే కాకుండా తాము ముగ్గురు గోవాలో పార్టీ కూడా చేసుకున్నామని వివరణ ఇచ్చాడు రానా.
తాను అనేక సార్లు తనకు త్రిషకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని అనేక సార్లు వివరణ ఇచ్చినా ఆ విషయాలు ఏవి పట్టించుకోకుండా మీడియా తామిద్దరి పై రకరకాల వార్తలను వారి ఇష్టం వచ్చినట్లుగా రాసుకున్నారని ఈ వార్తలను చదువుతూ ఈ వార్తలను ఖండించడం కూడా టైమ్ వేస్ట్ అని భావించి తాను ఏమి చేసేది లేక మౌనంగా ఉండి పోయానని కామెంట్ చేసాడు రానా.
అంతేకాదు తాను ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానని తాను ఎవరితోనూ ప్రేమ వ్యవహారాలు నడపడం కాని, సహజీవనం చేయడం కాని చేయడం లేదని వివరణ ఇచ్చాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి జీవించాలి అంటే ఎన్నో అభిప్రాయాలు కలవాలని అవేమి పట్టించు కోకుండా గాసిప్పులు రాయడం మీడియాకు ఫ్యాషన్ గా మారిందని కామెంట్ చేసాడు.
ఈ శుక్రు వారం బాలీవుడ్ లో తాను అక్షయ కుమార్ తో కలిసి నటించిన ‘బేబి’ సినిమా ప్రమోషన్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేసాడు రానా. ఈ సినిమా పై రానాకు చాల పెద్ద ఆశలే ఉన్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76708/RANA-COMMENTS-ON-TRISHA-MARRAIGE/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.