March 21, 2025 09:37:02 AM Menu
Latest

6:28 PM test1

శ్రీకాకుళం దగ్గర రాజాoలో జి యమ్ ఆర్ పాలిటెక్నిక్ విద్యార్ధులను ఉద్దేశిస్తూ పవన్ తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా విడి పోయిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ సంచలన కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మహాత్మాగాంధీ దేశం ఐక్యత కోసం పాటు పడితే ఒక తరానికి చెందిన రాజకీయ వ్యక్తులు చేసిన పొరపాటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయింది అని సంచలనాత్మక కామెంట్స్ చేసాడు.

ఎన్నికల తరువాత చాల విషయాల పై మౌనంగా ఉంటున్న పవన్ తన ‘జనసేన’ పొలిటికల్ పార్టీగా రిజిస్ట్రేషన్ పొందిన తరువాత పవన్ రాజకీయాల పై మాట్లాడటం ఇదే మొదటిసారి. ఎందరో దేశనాయకులు చేసిన త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది అని చెపుతూ వారంతా దేశం గురించి ఎంతో చేస్తే స్వాతంత్రాన్ని తీసుకు వచ్చిన చాలామందిని ప్రస్తుతం మనం మరిచి పోయాం అంటూ కామెంట్ చేసాడు.

అంతేకాదు ఈ సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనే తపన నేటి యువతరానికి ఉండాలి అని పిలుపును ఇస్తూ మన సమాజం ఆరోగ్య వంతంగా లేకపోతే సమాజంలో జీవించే ప్రజలు ఆరోగ్య వంతంగా ఎలా ఉంటారు అని ప్రశ్నించాడు పవన్.ఇక ‘స్వఛ్ భారత్’ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీ సొంతమో లేదంటే ఒక రాజకీయ వేత్త సొంతమో కాదని దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అని కోరుకునే ఏ వ్యక్తి అయినా ఈ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు అని షాకింగ్ కామెంట్స్ చేసాడు పవన్ కళ్యాణ్.
28 Jan 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top