ప్రముఖ హాస్య నటుడు ఎమ్. ఎస్. నారాయణ మరణించారన్న వదంతులు ఈరోజు కొద్ది సేపటి క్రితం కొన్ని ఛానల్స్ లో రావడంతో ఆ వార్తలను చూసిన చాలామంది టాలీవుడ్ ప్రముఖులు షాక్ అవుతున్నారు.
అయితే ఈ వార్తలను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించారు. కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎంఎస్ నారాయణ మదాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఎంఎస్ నారాయణకు ఆరోగ్య పరిస్థితి అత్యంత క్రిటికల్ గా ఉందని ఆయనను చూసి వచ్చిన టాలీవుడ్ ప్రముఖులు చెపుతున్నారు.
ప్రస్తుతం ఎమ్.ఎస్. నారాయణకు కొండాపూర్ లో ఉన్న కిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఆయన ఆర్గాన్ ఫైల్యూర్ వల్ల డయాల్సస్ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం మీడియా ముందుకు వచ్చి తమ తండ్రి ఖచ్చితంగా తిరిగి కోలుకుంటారని చెపుతూ వాస్తవాలను ప్రసారం చేయవలసిందిగా ఆయన కుమార్తి శశి కిరణ్ విజ్ఞప్తి చేస్తున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76826/TOLLYWOOD-GETTING-SHOCKED-WITH-RUMORS-ON-MS-NARAYANA/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.